బీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై చేస్తున్న ఉద్యమాన్ని అణచివేస్తున్నారని ఆరోపించారు.
ఓయూ, కేయూ విద్యార్థులపై ప్రభుత్వం చేస్తున్న అణచివేత చర్యలు సరికాదని తెలిపారు.విద్యార్థులు పోరాడకపోతే గతంలో తెలంగాణ వచ్చేదా అని ఆమె ప్రశ్నించారు.
పేపర్ లీక్ వ్యవహారంపై సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు.పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు తక్షణ సాయంగా రూ.50 వేలు ప్రకటించాలని కోరారు.