Minister Roja : సీఎం జగన్ పై షర్మిల విషం చిమ్ముతున్నారు..: మంత్రి రోజా

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila )పై మంత్రి రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.డీఎస్సీ విషయంలో షర్మిల ఇష్టారీతిన మాట్లాడటం మానుకోవాలన్నారు.

1998, 2008 తో పాటు 2018లో ఇవ్వాల్సిన డీఎస్సీలను సీఎం జగన్ ( CM Jagan )ఇచ్చారన్న మంత్రి రోజా వాటి ద్వారా సుమారు 17 వేల పోస్టులను భర్తీ చేశారని తెలిపారు.

తాజాగా 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్( Notification ) విడుదల చేశారని వెల్లడించారు.గతంలో తెలంగాణ బిడ్డనని చెప్పుకున్న షర్మిల ఇప్పుడు ఏపీకి వచ్చి హడావుడి చేస్తున్నారని విమర్శించారు.ఆమె వ్యాఖ్యలు చూస్తుంటే కనీస రాజకీయ అవగాహన లేదని అర్థం అవుతుందన్నారు.

సీఎం జగన్ పై షర్మిల విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.చంద్రబాబు( Chandrababu Naidu ) తన నాటకంలో షర్మిలను పావుగా వాడుకుంటున్నారని తెలిపారు.

Advertisement
గెలుపు కోసం ఒవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు .. : బీజేపీ అభ్యర్థి మాధవీలత

తాజా వార్తలు