సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియర్ రచయిత మృతి..!!

సినిమా ఇండస్ట్రీలో వరుస విషాద సంఘటనలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే.చాలామంది సీనియర్ నటీనటులు మరణిస్తూ ఉన్నారు.

గత ఏడాది సూపర్ స్టార్ కృష్ణ, సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు మరణించారు.ఈ ఏడాది ప్రారంభంలో సీనియర్ హీరోయిన్ జమున కొద్ది రోజుల క్రితం సీనియర్ దర్శకులు కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణించడం జరిగింది.తాజాగా నేడు సీనియర్ రచయిత, సెన్సార్ బోర్డు సభ్యుడు యడవల్లి వెంకటలక్ష్మి నరసింహ శాస్త్రి విజయవాడలో కన్నుమూశారు.

సినీ పరిశ్రమలో సీనియర్ రచయితగా పేరొందిన యడవల్లి దక్షిణాది సినిమా రంగంలో అనేక సినిమాలకు పనిచేయడం జరిగింది.తెలుగు, తమిళ్, కన్నడ సినిమాలకు రచనలు చేశారు.నెల్లూరులో పుట్టిన ఆయన విజయవాడలో స్థిరపడటం జరిగింది.

యడవల్లి వెంకటలక్ష్మి నరసింహ శాస్త్రి రచనలలో ప్రగతి కిరణాలు, తెలుగు సినీ దర్శక మాలిక-విజయ వీచిక వంటి రచనలు మంచి పేరు సంపాదించాయి.ఈ క్రమంలో సీనియర్ రచయిత యడవల్లి మరణంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement
ఓరి దేవుడా . . వీరికి ఇదేం పోయేకాలం.. నడిరోడ్డుపై అలా..

తాజా వార్తలు