Santosh Narayanan : 48 కోట్ల వ్యూస్.. రూపాయి కూడా రాలేదు.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు వైరల్!

ఎంజాయ్‌ ఎంజామి.ఈ ఆల్బమ్ ఎంతటి సెన్సేషన్ను క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే.

దాదాపు మూడేళ్ల క్రితం వచ్చిన ఈ ఆల్బమ్ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.గాయని ఢీ, తమిళ రాపర్‌ అరివు తారాగణంగా సంతోష్‌ నారాయణన్‌ ( Santosh Narayanan )నిర్మించారు.

యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించింది.ఇది విడుదలై మూడేళ్లు అయిన సందర్భంగా సంతోష్‌ తాజాగా స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేశారు.

కోట్లలో వ్యూస్‌ దక్కించుకున్న ఈ పాట వల్ల తాము ఏ మాత్రం ప్రయోజనం పొందలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఎంజాయ్‌ ఎంజామిని ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.దీనికి ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది.

బిలియన్లలో స్ట్రీమింగ్స్‌ అందుకుంది.అయితే, దీనివల్ల మేము ఎంత డబ్బు సంపాదించామో చెప్పాలనుకుంటున్నాను.

మేము సంపాదించింది సున్నా.నిజం, మాకు ఒక్క రూపాయి కూడా రాలేదు.

ఈ విషయంపై పాటను విడుదల చేసిన మజ్జా లేబుల్‌ను( Label Mazza ) సంప్రదించాలని ఎన్నోసార్లు ప్రయత్నించాము.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు

కానీ దురదృష్టవశాత్తు ప్రయోజనం లేకుండా పోయింది.ఆ లేబుల్‌ మాత్రం భారీ మొత్తంలో రెవెన్యూ అందుకుంది అని ఆయన ఆరోపణలు చేశారు.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.

Advertisement

యూట్యూబ్ లో అంతటి సెన్సేషన్ను క్రియేట్ చేసిన ఈ సాంగ్ వల్ల వారికి ఒక్క రూపాయి కూడా రాలేదు అన్నది నిజంగా ఆశ్చర్య పోవాల్సిన విషయం అని చెప్పవచ్చు.

తాజా వార్తలు