చంద్రబాబుకు పెన్షనర్ల ఉసురు తగులుతుంది అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీలో మరో రెండు వారాలలో ఎన్నికలు( AP Elections ) జరగబోతున్నాయి.ఈ క్రమంలో పెన్షన్ పంపిణీ చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి.

ఏప్రిల్ మొదటి తారీకు వాలంటీర్లు( Volunteers ) పెన్షన్ పంపిణీ చేయకూడదని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వటం జరిగింది.దీంతో ఆ సమయంలో వృద్దులు అనేక కష్టాలు పడ్డారు.

ఇదే సమయంలో అధికార పార్టీ విపక్షాలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం జరిగింది.కాగా ఇప్పుడు మే మొదటి తారీకు వస్తూ ఉండటంతో మళ్ళీ పెన్షన్ పంపిణీ కార్యక్రమం( Pension Distribution ) జరగాల్సిన ఉండటంతో పొలిటికల్ వాతావరణం మరింత వేడెక్కింది.

Sajjala Ramakrishna Reddy Serious Comments On Chandrababu,sajjala Ramakrishna Re

ఇప్పటికే పెన్షన్ లబ్ధిదారుల ఎకౌంటుల్లో డబ్బులు వేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం జరిగింది.ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వ సలహాదారు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి( YCP Sajjala Ramakrishna Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు ఆయన ముఠా కారణంగా పెన్షనర్లు అవస్థలు పడుతున్నారని విమర్శించారు.

Advertisement
Sajjala Ramakrishna Reddy Serious Comments On Chandrababu,Sajjala Ramakrishna Re

చంద్రబాబు( Chandrababu ) మనిషి జన్మ ఎలా ఎత్తాడో అర్థం కావడం లేదు.సీఎంను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.

ఆయనకు పెన్షనర్ల( Pensioners ) ఉసురు తగులుతుంది.చంద్రబాబు ఏనాడు పెన్షన్లు సరిగా ఇవ్వలేదు.

కులాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు అలవాటు.కూటమి డిపాజిట్లు గల్లంతు అవటం గ్యారెంటీ అని సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు