బాహుబలి రేంజ్ సినిమాలో సాయితేజ్.. ఈ సినిమాతో క్రేజ్ ఎన్నో రెట్లు పెరగనుందా?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సంబరాల ఏటిగట్టు.

( Sambarala Yetigattu ) అయితే ఈ సినిమా టైటిల్ ని ఇంకా ఫిక్స్ చేయలేదు.

ప్రస్తుతానికి ఈ సంబరాల ఏటిగట్టు అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.రోహిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది.

నేడు సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి తాజాగా చిన్న గ్లింప్స్ ని విడుద‌ల చేశారు.వ‌ర‌ల్డ్ బిల్డింగ్ ని ప‌రిచ‌యం చేస్తూ సాగిన గ్లింప్స్ ఇది.

చివ‌ర్లో హీరోని వెనుక నుంచి చూపించారు.ఆ క‌టౌట్ అదిరింది.

Advertisement

ఆ మేకొవ‌ర్ అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ సాయి తేజ్ బొద్దుగా క‌నిపించేవాడు.కానీ ఈ సినిమా కోసం బాగా త‌గ్గాడు.పైగా కండ‌లు పెంచాడు.

ఆ క‌టౌట్‌, గ్లింప్స్ లోని వాతావ‌ర‌ణం చూస్తుంటే ఇది సాయితేజ్ బాహుబ‌లినా( Baahubali ) అనేంతలా ఆశ్చ‌ర్యం వేస్తోంది.కాగా ఈ సినిమాను స్వాతంత్ర్యం రాక‌పూర్వం జ‌రిగిన ఓకే య‌దార్థ సంఘ‌ట‌న ఆధారంగా తెర‌కెక్కిస్తున్నట్లు పిలుస్తోంది.

అంతేకాకుండా ఈ సినిమా కోసం ఓకే గ్రామ‌మే సృష్టించారట.యుద్ధ స‌న్నివేశాల‌కు చాలా ప్రాధాన్యం ఉంది.

అతి ఆకలి బాగా ఇబ్బంది పెడుతుందా.. అయితే ఇలా చెక్ పెట్టండి!
నా జీవితమే ఒక బ్లెస్సింగ్, నేను దేవుడి బిడ్డని : మీనాక్షి చౌదరి..

వాటికి సంబంధించిన విజువ‌ల్స్ కూడా గ్లింప్స్ లో చూపించారు.టైటిల్ ఇంకా ప్ర‌క‌టించ‌లేదు.దాదాపు రూ.100 కోట్ల‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న‌ట్టు స‌మాచారం.

Advertisement

సాయితేజ్ కెరీర్‌లో నిర్మిత‌మ‌వుతున్న భారీ బ‌డ్జెట్ సినిమా ఇదే.అయితే ఈ సినిమాతో తప్పకుండా సాయి ధరంతేజ్ మరింత పెరుగుతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

అంతేకాకుండా ఈ సినిమా కోసం సాయి ధరంతేజ్ కూడా కొంచెం గట్టిగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.అందుకోసం తన బాడీని కూడా మార్చుకున్నారట సాయి ధరమ్ తేజ్.

తాజా వార్తలు