సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో అగ్రతారలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సీనియర్ నటి రమ్యకృష్ణ రోజా( Roja ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.రమ్యకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉండగా రోజా మాత్రం రాజకీయాలలోకి వచ్చి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.
ఇలా వీరిద్దరూ తమ వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే రమ్యకృష్ణ మొదటి సారి తన కుమారుడిని తీసుకుని వెళ్లి తిరుమల శ్రీవారిని (Tirumala Srivaru ) దర్శించుకున్నారు.
ఇలా స్వామివారి దర్శనం అనంతరం రమ్యకృష్ణ అదే దారిలో తన స్నేహితురాలు మంత్రి రోజా ఇంటికి వెళ్లారు.ఇలా రమ్యకృష్ణ రోజా ఇంటికి వెళ్ళగానే రోజా సాదర స్వాగతం పలికారు.అనంతరం ఇద్దరు కబుర్లు చెప్పుకోవడమే కాకుండా రమ్యకృష్ణకు విందు కూడా ఏర్పాటు చేశారు.అనంతరం రోజా రమ్యకృష్ణ( Ramya Krishna ) కు చీర సారె కూడా పెట్టి పంపించారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను రోజ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.దీంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ ఫోటోలను రోజా ట్విట్టర్లో షేర్ చేయడమే కాకుండా.ఇద్దరు స్నేహితులు ఒక మంచి నక్షత్రా లాంటివారు కానీ మీరు వారిని ఎప్పుడూ చూడరు కానీ వాళ్ళు అక్కడే ఉన్నారని మీకు తెలుసు.ఈరోజు నా రోజును ఇంత అందంగా మార్చిన నా నక్షత్రానికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను అంటూ ఈ సందర్భంగా రోజా రమ్యకృష్ణతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఇలా వీరిద్దరూ చాలా రోజుల తర్వాత ఇలా కలవడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.