ఇంద్రకీలాద్రిపై పోలీసులపై డిప్యూటి సీయం, దేవాదాయశాఖమంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.గుడిలో భక్తుల రద్ది ఎక్కువగా ఉన్న సమయంలో తమ కుటుంబ సభ్యులను పోలీసులు దర్శనానికి తీసుకెళుతున్నారు.
అదే సమయంలో క్యూలైన్స్ పరిశీలనలో ఉన్న మంత్రి కొట్టు.పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
చినరాజగోపురం వీఐపీ ఎంట్రీ పాయింట్ వద్ద పోలీసులపై ఆయన ఫైర్ అయ్యారు.డిఎస్పి ఎక్కడ అంటూ ప్రశ్నించారు.
డ్యూటి చేయమంటే మీవాళ్లను పంపుకుంటారా అంటూ మండిపడ్డారు.విధులు నిర్వహించడం వెళ్లిపోవచ్చంటూ సూచించారు.
మరోసారి ఇలాచేస్తే ఊరుకోబోనంటూ మంత్రి హెచ్చరించారు.







