టీడీపీలోకి ఎంపీ విజయసాయి రెడ్డి బంధువులు..!!

ఏపీలో వైసీపీకి షాక్ తగిలింది.పార్టీలో కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి బంధువులు టీడీపీలో చేరనున్నారు.

విజయసాయిరెడ్డి బావమరిది, మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి టీడీపీలో చేరుతున్నారు.ద్వారకానాథ్ రెడ్డితో పాటు ఆయన బంధువులు భారీ సంఖ్యలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు.

ఈ మేరకు విజయసాయిరెడ్డి బంధువులు అంతా ఎన్టీఆర్ భవన్ కు చేరుకున్నారు.కాసేపట్లో వీరంతా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు.

విజయసాయిరెడ్డి, ఆయన సతీమణి సునందా రెడ్డి తప్ప మిగిలిన కుటుంబ సభ్యులు అందరూ టీడీపీలో చేరుతున్నారని సమాచారం.దివంగత నేత తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి ద్వారకానాథ రెడ్డి మేనమామన్న సంగతి తెలిసిందే.

Advertisement
సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని

తాజా వార్తలు