వైసీపీలో తిరుగుబాటు మొదలైందని టిడిపి నేత ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు చేశారు.ఉమ్మడి గుంటూరు జిల్లా టిడిపి నేతలు అందరూ సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.వైసిపి అరాచకాలకు, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
జగన్ ను నమ్ముకుంటే భవిష్యత్తు లేదని రాష్ట్ర ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు.జగన్ ఓటమి పులివెందుల నుంచి ప్రారంభమైందన్నారు.
దీంతో ముందస్తు ఎన్నికలకు రావాలన్న జగన్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.ఒకవేళ వైసీపీ ముందు వస్తే ఎన్నికలకు వెళ్లిన వైసీపీలో తిరుగుబాటు ఖాయమని జోష్యం చెప్పారు.