రూ.5 కోట్లు ఇస్తే మోడీనే చంపుతా అన్నాడు.. చివరికి?

కొంతమంది సామాన్య వ్యక్తులు పలువురు నాయకులను, ఇతర రంగాలకు సంబంధించిన వ్యక్తులను వ్యతిరేక ఉద్దేశంతో పలు రకాల ప్రకటనలు చేస్తూంటారు.

అంతేకాకుండా వాళ్లని విమర్శించడానికి ఇతరులతో కొన్ని బెదిరింపులు కూడా చేయిస్తుంటారు.

కొందరు తమ సంపాదన కోసం మీకు ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళని బెదిరిస్తామంటూ పలు రకాలుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు చేస్తూంటారు.ఈ ఉద్దేశంతోనే కొందరు వారికి ఉన్న శత్రువులను బెదిరించడానికి లేదా ఇలాంటి దాడులకు దిగడానికి ఇలా ప్రకటనలు చేసే వ్యక్తుల చేతులను కలుపుతుంటారు.

ఇదిలా ఉంటే పుదుచ్చేరికి చెందిన రియల్టర్ సత్యానందం.ఇతని వయస్సు 43 ఏళ్లు.

ఇటీవలే ఫేస్ బుక్ లో సత్యానందం చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్య పరిచింది.తనకు ఎవరైనా రూ.5 కోట్లు ఇస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంపుతానంటూ సోషల్ మీడియాలో తన ఫేస్ బుక్ అకౌంట్లో ఇలా పోస్ట్ చేశాడు.దీంతో ఫేస్ బుక్ వినియోగదారులో ఒకరైనా టాక్సీ డ్రైవర్ ఆ ప్రకటనను చూసి ఆశ్చర్యపోయాడు.

Advertisement

దీంతో ఈ విషయాన్ని ఆ టాక్సీ డ్రైవర్ పోలీసులకు తెలిపాడు.ఇక పోలీసులు కేసును నమోదు చేసుకొని సత్యానందం ను తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా ట్రేస్ చేసి మొత్తానికి పట్టుకున్నారు.

పుదుచ్చేరికి సమీపంలో ఆర్యన్ కుప్పం గ్రామంలో సత్యానందం దొరకగా అక్కడికక్కడే అతన్ని అరెస్టు చేశారు.సత్యానందం నుంచి పూర్తి విషయాలు తెలుసుకొని కోర్టులో హాజరు పరిచారు.

ఇక న్యాయమూర్తి అతని పై తగిన చర్యలు తీసుకొని రిమాండ్ కు తరలించారు.ఈ విధంగా నిందితుడికి ఐపీసీ సెక్షన్ కింద 505(1),505(2) కేసులు నమోదు చేసి తరలించారు.

ఈ విధంగా ఇలాంటి ప్రచారాలు చేస్తే కఠిన చర్యలతో తగిన శిక్షలు అందిస్తామంటూ కోర్టు తెలిపింది.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు