టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన( Rashmika Mandanna ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
కిరాక్ పార్టీతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ నాగశౌర్య హీరోగా నటించిన చలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.దానికి తోడు ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవడంతో ఈమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి.
ఎలాంటి పాత్రలో నటించిన ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేస్తూ ప్రేక్షకులను మెప్పించడంతో పాటు అందరి చేత శబాష్ అనిపించుకుంటుంది రష్మిక.ఇకపోతే రష్మిక చివరగా యానిమల్ మూవీ తో ( Animal Movie ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా తర్వాత రష్మికకు బాలీవుడ్ లో కూడా అవకాశాలు క్యూడుతున్నాయి.ఈ అమ్మడి పుట్టిన రోజు సందర్భంగా ఆమె సొంతం చేసుకున్న కొన్ని ఘనతల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇటీవల టోక్యోలో జరిగిన క్రంచీ రోల్ అనిమే అవార్డులకు రష్మిక హాజరైంది.అక్కడ అభిమానులు పుష్ప సినిమాలో( Pushpa Movie ) శ్రీవల్లి పాత్రకు సంబంధించిన ఫొటోలు పట్టుకొని వారి అభిమానాన్ని చూపించారు.
దీంతో పాటు మరో అరుదైన ఘనత కూడా ఆమె సొంతం చేసుకుంది.భారతదేశం నుంచి ఈ అవార్డు వేడుకకు హాజరైన తొలి సెలబ్రిటీ రష్మిక కావడం విశేషం.
దీంతో పలువురు ప్రముఖులు కూడా రష్మికపై ప్రశంసలు కురిపించారు.తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలతో బిజీగా ఉండే రష్మిక ఇటీవల కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టింది.జపాన్కు చెందిన ఒనిట్సుకా టైగర్ ఫ్యాషన్( Onitsuka Tiger Fashion ) సంస్థకు బ్రాండ్ అడ్వకేట్ గా వ్యవహరిస్తోంది.
ఆ సంస్థకు బ్రాండ్ అడ్వకేట్గా నియమితులైన ఫస్ట్ భారతీయురాలు తానేనని స్వయంగా వెల్లడించి ఆనందం వ్యక్తం చేసింది.గతేడాది నిర్వహించిన మిలాన్ ఫ్యాషన్ వీక్ లోనూ ఈ సుందరి హోయ లొలికించింది.
ఈ ఏడాది ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన ఫోర్బ్స్ ఇండియా( Forbes India ) 30 అండర్ 30 జాబితాలోనూ రష్మిక స్థానం సంపాదించుకుంది.ఏటా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచే వ్యక్తుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేస్తుంది.30 ఏళ్ల వయసు లోపున్న 30 మంది ప్రతిభావంతుల లిస్ట్ను తాజాగా విడుదల చేసింది.ఇందులో పలు రంగాల్లో విశేష కృషి చేస్తున్న వారిని గుర్తించి జాబితాను సిద్ధం చేస్తుంది.
దీంట్లో రష్మిక అగ్రస్థానంలో నిలిచింది.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన శ్రీవల్లి తనను ఎంపిక చేసిన వారికి కృతజ్ఞత చెప్పింది.తన నటనతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న రష్మిక ఇటీవల అరుదైన ఘనతను సాధించింది.నెదర్లాండ్స్ కు చెందిన సెప్టిమిస్ అవార్డ్స్ నామినేషన్స్లో నిలిచింది.
నెదర్లాండ్స్ కు చెందిన ఈ సంస్థ ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమకు సంబంధించిన కొన్ని విభాగాల్లో బెస్ట్ అవార్డ్స్ ప్రకటిస్తుంది.ఈ క్రమంలోనే బెస్ట్ ఏషియన్ యాక్ట్రెస్( Best Asian Actress ) నామినేషన్స్లో ఇండియా నుంచి మన రష్మిక మందన్న నిలిచింది.ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రష్మికకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.43 మిలియన్ల మందితో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోయిన్స్లో ఒకరిగా ఆమె ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.ముఖ్యంగా టాలీవుడ్లో ఈ మార్క్ను చేరుకున్న తొలి హీరోయిన్గానూ క్రేజ్ దక్కించుకుంది.
ఇక మొదటి సినిమాలోనే తన నటనకు గాను ఉత్తమ నటిగా సైమా అవార్డును సొంతం చేసుకుంది రష్మిక.ఇప్పటి వరకు ఇదే జాబితాలో ఆమె తొమ్మిది సార్లు అవార్డు అందుకుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy