ఏపీ ముఖ్యమంత్రి పోలికలతో ఉన్న ఓవ్యక్తికి సంబంధించిన వీడియో కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.ఆ వ్యక్తి ఆచూకీ దొరకడం….
లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తా అంటే వద్దు అనడం కూడా అందరికి తెలిసిందే.తర్వాత అతను వర్మ సినిమాలో నటించను అని చెప్పి ట్విస్ట్ ఇవ్వడం కూడా అందరికి తెలిసిందే.
అయితే ఎప్పుడు వివాదాలకు దగ్గరగా ఉండే రామ్ గోపాల్ వర్మ మరోసారి ఎన్ఠీఆర్ గురించి సంచలన కామెంట్స్ చేసారు.లక్ష్మి పార్వతిలాంటి సాధారణ మహిళా ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా ప్రవేశించింది అనే అంశంతో తాను ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు రాంగోపాల్ వర్మ తెలిపాడు.
ఆ సినిమాకి సంబందించిన విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు వర్మ.
ఎన్టీఆర్ అంటే సాధారణమైన వ్యక్తి కాదు.పొలిటికల్ సిస్టమ్ నే మార్చేసి దేశ రాజకీయాలనే శాసించిన వ్యక్తి.అలాంటి వ్యక్తి లక్ష్మి పార్వతి మాయలో ఎలా పడతారు.
లక్ష్మి పార్వతి గురించి అన్ని విషయాలు నెగిటివ్ గానే విన్నానని వర్మ తెలిపాడు.
పిల్లలు పుట్టించడం కోసం లక్ష్మి పార్వతి మందులు ఉపయోగించింది, అందువలనే ఎన్టీఆర్ అనారోగ్యానికి గురయ్యారు అనే ప్రచారంపై వర్మ స్పందించాడు.కేవలం ఇది మాత్రమే కాదు చేతబడి చేయించింది, మందు పెట్టేసింది అని కూడా విన్నా అని వర్మ అన్నారు.
ఎన్ఠీఆర్ ఒక సూపర్ స్టార్…లక్ష్మి పార్వతి మాత్రం సాధారణ మహిళ.
పెద్దగా అందగత్తె కూడా కాదు.ఇలాంటి వీరిద్దరూ ఎలా దగ్గరయ్యారు అనే పాయింట్ ఈ చిత్రంలో చాలా కీలకం అని వర్మ అన్నారు.
ఆమె గురించి తన స్టైల్ లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అంట వర్మ.అన్ని ఒక కొలిక్కి వచ్చాక సినిమా తెరకెక్కిస్తారంట.