మెగా హీరో రామ్ చరణ్( Ram charan ) ప్రస్తుతం నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్( Game changer ).ఈ సినిమా దిల్ రాజు నిర్మాణం లో రూపొందుతున్న విషయం తెలిసిందే.
తమిళ లెజెండ్రీ దర్శకుడు శంకర్ దర్శకత్వం లో ఈ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతోంది.ఈ సినిమా అనివార్య కారణాల వల్ల దాదాపు 6 నెలల పాటు ఆలస్యం అవుతోంది.
ఈ సంవత్సరం లోనే సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకున్నా కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కి సినిమాలు కన్ఫర్మ్ చేయడం జరిగింది.సినిమా ఆలస్యం అవ్వడం వల్ల దాదాపు పాతిక కోట్ల రూపాయల అదనపు భారం నిర్మాత పై పడబోతోంది.
అంతే కాకుండా సినిమా బడ్జెట్ లో కూడా లెక్కలు తారు మారయ్యాయట.దాంతో మరో పాతిక కోట్ల రూపాయలు దిల్ రాజు పై భారం పడబోతోంది అనే టాక వినిపిస్తుంది.ఇదే నిజమైతే సినిమా కి మొదట అనుకున్న దానితో పోలిస్తే రూ.50 కోట్లు అదనంగా బడ్జెట్ పెరగబోతుంది.మరి సినిమా ఆ పెరిగిన బడ్జెట్ ని.ఎంత వరకు మోయగలదు అనేది హాట్ టాపిక్ గా మారింది.

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా కాబట్టి అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది.ఆసక్తి కి తగ్గట్లుగా సినిమానే రూపొందిస్తే తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉంటాయి.అదే నమ్మకంతో దిల్ రాజు( Dil raju ) ఈ సినిమా కు భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం అందుతుంది.అని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా గేమ్ ఛేంజర్ సినిమా ఉంటుందని మెగా ఫాన్స్ విశ్వసిస్తున్నారు.

ఇక ఈ సినిమా లో రామ్ చరణ్ కి జోడిగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు.తండ్రి పాత్ర కు గాను చరణ్ కి జోడిగా అంజలి హీరోయిన్ గా కనిపించబోతోంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీ పై ఇప్పటికే స్పష్టత వచ్చింది.
కనుక షూటింగ్ ని అక్టోబర్ వరకు పూర్తి చేయాలని మేకర్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.అది ఎంత వరకు సాధ్యమవుతుందో చూడాలి.సినిమా సంక్రాంతికి విడుదల అవుతుందా లేదంటే వచ్చే ఏడాది సమ్మర్ కి వాయిదా పడుతుందా అనేది తెలియాల్సి ఉంది.