పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో చరణ్.. ఈ పిక్ వెనుక అసలు స్టోరీ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా వెలుగొందు తున్నాడు.

మునుపటి కంటే మరింత యాక్టివ్ గా ఉంటూ తన లైనప్ ను ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులతో ఫిల్ చేసుకుంటున్నాడు.

ఈయన ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అవ్వడంతో ఈయన సినిమాలపై కూడా అందరిలో ఆసక్తి నెలకొంది.ఇదిలా ఉండగా రామ్ చరణ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

రామ్ చరణ్ ను పాన్ ఇండియన్ ప్రొడ్యూసర్స్( Pan India Producers ) కలిసిన పిక్ వైరల్ కాగా వీరి భేటీకు కారణం ఏంటా అని అంతా ఆరా తీస్తున్నారు.రామ్ చరణ్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని,( Naveen Yerneni ) డీవీవీ ఎంటర్టైన్మెంట్ అధినేత డీవీవీ దానయ్య లతో( DVV Danaiah ) పాటు ప్రముఖ రాజకీయ నాయకుడు గంటా శ్రీనివాసరావు( Ganta Srinivasa Rao ) కూడా ఈ ఫొటోలో కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

పాన్ ఇండియన్ ప్రొడ్యూసర్స్ తో పాటు రాజకీయ నాయకుడితో చరణ్ ఎందుకు భేటీ అయ్యారు అసలు వీరి మధ్య భేటీకి కారణం ఏంటి అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.మరి తర్వాత అయిన ఈ భేటీకి కారణం తెలుస్తుందో లేదో చూడాలి.ఇక ప్రస్తుతం రామ్ చరణ్ అగ్ర డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా( Game Changer ) చేస్తున్నాడు.

Advertisement

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది.వచ్చే ఏడాది గ్రాండ్ గా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక చరణ్ ఈ సినిమా తర్వాత నెక్స్ట్ తన 16వ ప్రాజెక్ట్ ను యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో ప్రకటించాడు.గేమ్ చేంజర్ షూట్ అవగానే ఇది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.

బీట్‌రూట్ ఆకుల‌తో ఇలా చేస్తే.. ఊడిన జుట్టు మ‌ళ్లీ వ‌స్తుంది!
Advertisement

తాజా వార్తలు