తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న “భారత్ జోడో” యాత్రలో రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు అటు జాతీయ మరియు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.తాజాగా హైదరాబాద్ లో జరుగుతున్న పాదయాత్రలో నెక్లెస్ రోడ్డు వద్ద ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర సమావేశంలో రాహుల్ ప్రసంగం చేస్తూ టిఆర్ఎస్, బీజేపీ పార్టీలపై మండిపడ్డారు.
ఈ రెండు పార్టీలు రైతులకు అండగా ఉండవు అని ఆరోపించారు.అదేవిధంగా నోట్ల రద్దు మరియు జిఎస్టి వలన దేశంలో చిన్న వ్యాపారులు ఎంతగానో నష్టపోయారని తెలిపారు.
దేశంలో విమానాశ్రయాలు, టెలికాం, ఎల్ఐసి అన్నింటిని మోడీ అమ్మేస్తున్నారు.త్వరలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కూడా అమ్మేస్తారు అని అన్నారు.కేసీఆర్ దృష్టి ఎప్పుడు ధరణి పోర్టల్ మీద ఉంటుంది.ఆక్రమించుకోవడానికి భూములు ఎక్కడ ఉన్నాయో అని వెతుకుతారు అని రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
అదేవిధంగా దేశంలో నిరుద్యోగం ఎక్కువైపోయిందని అన్నారు.

ఇంజనీరింగ్ లాంటి ఉన్నత చదువులు చదివినా గాని స్విగ్గిలో పనిచేయాల్సిన పరిస్థితులు దాపరించాయి.టిఆర్ఎస్, బీజేపీ పాలనలో నిరుద్యోగులకు ఉపాధి లేదు.ఎన్నో సందర్భాలలో కలిసి పని చేసిన ఈ రెండు పార్టీలు ఎన్నికల సమయంలో విడిపోయినట్లు నాటకాలు ఆడతాయి.
కేసీఆర్ ఫోన్ చేసిన వెంటనే మోడీ స్పందిస్తారు అంటూ.రాహుల్ ఈ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.