ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించనున్నారు.ఇందులో భాగంగా రైల్వే శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్న ఆయన ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీయనున్నారు.
ఇప్పటికే రైలు ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేసిన మోదీ మృతులకు, బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించారు.మరోవైపు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది.
ఈ ఘటనలో ఇప్పటివరకు 238 మంది మృతిచెందగా వెయ్యి మందికి పైగా గాయపడ్డారు.