టాలీవుడ్ లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో ప్రభాస్ ఒకరు.ఆయన సినిమా రిలీజ్ అవుతుంది అంటే థియేటర్ల దగ్గర అభిమానుల సందడి ఓ రేంజ్ లో ఉంటుంది.
ఈ క్రమంలో ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ సినిమా రిలీ రోజు గుంటూరు లోని కారంపూడి పల్నాడులో ఐమ్యాక్స్ థియేటర్ దగ్గర ప్రభాస్ బ్యానర్ కడుతూ చల్లా కోటేశ్వర రావు అనే అభిమాని ప్రమాదవశాత్తు మరణించాడు.నిరుపేద కుటుంబమైన కోటేశ్వర రావు మరణం అతని కుటుంబాన్ని రోడ్డుపాలు చేసింది.
అయితే అభిమాని మృతి విషయం తెలుసుకున్న ప్రభాస్ వెంటనే కోటేశ్వర రావు ఫ్యామిలీకి 2 లక్షల రూపాయల ఆర్ధిక సాయం అందించారట.అంతేకాదు ఫ్యూచర్ లో ఆ ఫ్యామిలీకి ఎలాంటి ఆపద వచ్చినా తనని కలవమని హామీ ఇచ్చారట.
ఆ అభిమాని కుటుంబానికి ప్రభాస్ ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పినట్టు తెలుస్తుంది.ప్రభాస్ చేసిన ఈ సాయానికి అభిమానులంతా సంతోషంగా ఉన్నారు.
హీరోలు కూడా తమ మీద అభిమానం ఓకే కానీ ముందు మీరు జాగ్రత్త.మీ ఫ్యామిలీలకు మీరు చాలా అవసరం అని చెబుతూనే ఉంటారు.
కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.