టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం టాప్ హీరోయిన్గా ఇండస్ట్రీలో దూసుకుపోతుంది.కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్లో కూడా ఈ బ్యూటీ తనదైన మార్క్ వేసుకుని దూకుడు చూపిస్తోంది.
అయితే ఈ బ్యూటీ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇంటికే పరిమితం అయ్యింది.ఇటీవల అమ్మడికి కరోనా కూడా సోకడంతో హోం క్వారంటైన్లో ఉంటున్నట్లు తెలిపింది.
అయితే లాక్డౌన్ సమయంలో అమ్మడు ఏం చేస్తుందా అని అందరికీ సందేహం కలుగుతోంది.
దీంతో తాను లాక్డౌన్ సమయంలో ఏం చేస్తున్నానో సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నా, పలు సినిమాలకు సంబంధించిన స్క్రి్ప్టులను తాను వింటున్నట్లు చెబుతోంది.కరోనా కష్టకాలంలో అందరూ ఇళ్లలో ఉంటూ తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేయాలని, తాను తన కుటుంబ సభ్యులు ఇంట్లో నుండి కాలు బయట పెట్టడం లేదని ఆమె చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం తన చేతిలో ఆరు ప్రాజెక్టులు ఉన్నా, మరిన్ని స్క్రిప్టులను ఓకే చేసే పనిలో ఈ బ్యూటీ బిజీగా మారింది.
మొత్తానికి అందరూ లాక్డౌన్ సమయంలో ఖాళీగా గడిపేస్తుంటే, పూజా హెగ్డే మాత్రం వరుసగా స్క్రిప్టులు వింటూ యమబిజీగా ఉంది.
ఇక ఈ బ్యూటీ టాలీవుడ్లో ప్రస్తుతం రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చిత్రాలను రిలీజ్కు రెడీ చేసింది.ఈ సినిమా షూటింగ్ కొంతమేర మిగిలి ఉండగా, లాక్డౌన్ కారణంగా అది వాయిదా పడింది.
మరి ఈ బ్యూటీ లాక్డౌన్లో ఇంకా ఎన్ని స్క్రిప్టులను ఓకే చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.ఇక కరోనా నుండి కోలుకున్నాక అమ్మడిలో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తుందని ఆమె అభిమానులు అంటున్నారు.
మరి ఈ బ్యూటీ లాక్డౌన్లో ఎలాంటి సినిమాలు ఓకే చేస్తుందో చూడాలి.