నిన్న పోలీస్... నేడు లెక్చరర్ గా మారిపోయిన పవన్ కళ్యాణ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే రీ ఎంట్రీ తర్వాత వకీల్ సాబ్ చిత్రం ద్వారా పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో ప్రేక్షకులను సందడి చేశారు.

అదేవిధంగా భీమ్లా నాయక్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర ద్వారా మరోసారి ప్రేక్షకులను సందడి చేస్తూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నారు.ఇలా లాయర్ పోలీస్ ఆఫీసర్ పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన పవన్ కళ్యాణ్ మరోసారి లెక్చరర్ గా మారిపోయి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా మరో చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.పవన్ కళ్యాణ్ ఇందులో లెక్చరర్ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.

Advertisement

పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే అందరికీ గబ్బర్ సింగ్  సినిమా గుర్తొస్తుంది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు.ఈ క్రమంలోనే తరువాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని అందరూ భావించారు.

అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లెక్చరర్ పాత్ర ద్వారా చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం.పూర్తి స్క్రిప్ట్ సిద్ధం కాగానే పవన్ బల్క్ డేట్స్ ఇస్తానని నిర్మాతలకు మాటిచ్చినట్లు తెలుస్తోంది.

మరి ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియాల్సి ఉంది.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు