పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) మళ్ళీ సినిమా షూటింగులలో వేగం పెంచేసాడు.ఇటీవలే ఒక రీమేక్ సినిమా షూట్ ను పవన్ ముగించాడు.
కేవలం 22 రోజుల డేట్స్ మాత్రమే ఈ సినిమాకు కేటాయించడంతో శరవేగంగా షూటింగ్ జరిగింది.కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘వినోదయ సీతం రీమేక్ లో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ), పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తున్నారు.
సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఇచ్చిన 22 రోజుల డేట్స్ ను సరిగ్గా వాడుకుని షూట్ మొన్నటితో పూర్తి చేసారు.ఇక ఈ సినిమా జులై 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.
ఇదిలా ఉండగా 2024 ఎన్నికల ప్రచారం కోసం పవన్ సిద్ధం కావాల్సి ఉండగా ఈ లోపులోనే వీలైనన్ని సినిమాల షూటింగులు పూర్తి చేయాలని చూస్తున్నాడు.
అందుకే ఈ రీమేక్ సినిమా షూట్ పూర్తి కాగానే వెంటనే మరో సినిమా షూటింగ్ తో బిజీ కాబోతున్నట్టు తెలుస్తుంది.మరి పవన్ లైనప్ లో ఉన్న సినిమాల్లో హరీష్ శంకర్ ( Harish Shankar ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ”ఉస్తాద్ భగత్ సింగ్” ( Ustaad Bhagat Singh ) ఒకటి.గబ్బర్ సింగ్ అనే సూపర్ హిట్ కాంబోను మరోసారి రిపీట్ చేస్తుండడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
మరి అతి త్వరలోనే ఈ సినిమా షూట్ స్టార్ట్ కాబోతుందట.
ఇటీవలే పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ బల్క్ డేట్స్ కేటాయించినట్టు టాక్.అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ కోసం పవర్ స్టార్ 90 రోజుల డేట్స్ ను కేటాయించారట.మరి ఈసారి కూడా హరీష్ శంకర్ పవన్ కు గబ్బర్ సింగ్ లాంటి హిట్ అందిస్తాడో లేదో వేచి చూడాలి.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.అలాగే పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది అని వార్తలు వస్తుండగా.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.