దొరల ప్రభుత్వం కాదు.. ప్రజల ప్రభుత్వం..డిప్యూటీ సీఎం భట్టి

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో ‘ప్రజాపాలన’ కార్యక్రమం కొనసాగుతోంది.ఈ మేరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు.

 Not A Government Of Aristocrats.. Government Of The People Deputy Cm Bhatti-TeluguStop.com

ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.ఇది దొరల ప్రభుత్వం కాదు.ప్రజల ప్రభుత్వమని స్పష్టం చేశారు.

ప్రజల వద్దకే పాలన అందిస్తామని చెప్పారు.ప్రభుత్వాన్ని ప్రజలకే అంకితం చేస్తామన్న భట్టి ప్రభుత్వంలోని ప్రతి వ్యవస్థ మాకోసమే పెట్టారని ప్రజలు భావించే విధంగా పాలన అందిస్తామని తెలిపారు.

తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు.ఇందులో ఇప్పటికే రెండు పథకాలను మొదలు పెట్టామని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే ప్రజల దగ్గరికే వెళ్లి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని ఆయన తెలిపారు.ఇవాళ ప్రారంభమైన అభయహస్తం గ్యారెంటీ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వచ్చే నెల 6వ తేదీ వరకు కొనసాగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube