మోడీ అనుమతితోనే పిచ్చి మాటలు

బీజేపీ నాయకులు కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ దేశంలో మత సహనం దెబ్బ తీసేలా ప్రవర్తిస్తున్న సంగతి తెలుసు.

కొంత కాలంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం.

అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే కాషాయం నాయకులు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.సూత్రధారి ఆయనేనని చెప్పింది.

మోడీ నియంత కాబట్టి ఆయన ఏ పని చెబితే ఆ పని చేస్తున్నారట.కాంగ్రెస్ ఎంపీలు వారు సాధువులు, సాధ్వీలు ఎవరైనా కావొచ్చు మోడీ అనుమతి లేనిదే మాట్లాడారని కాంగ్రెస్ అదికార ప్రతినిధి శక్తి సిన్హా గోహిల్ అన్నారు.

బీహార్ ఎన్నికల ప్రచారంలో మోడీ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.గతంలో అటల్ బీహారీ వాజపేయీ మోడీని రాజధర్మం పాటించాలని సలహా ఇచ్చారని చెప్పారు.

Advertisement

ప్రజలకు రక్షణ కల్పించలేకపోతే పదవి నుంచి దిగిపోవాలని సుప్రీం కోర్టు అక్షింతలు వేసిందని గుర్తు చేశారు.ఒకవేళ బీహార్ ఎన్నికల్లో కాషాయ పార్టీ ఓడిపోతే మోడీపై ప్రతిపక్షాల విమర్శలు మరింత ఎక్కువ అవుతాయి.

బీహార్లో ఎన్డీయే ఓడిపోతే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నాయకులు చాలావరకు కారణం అవుతారు.ఇక ముందైనా వారికి కళ్ళెం వేయాలి.

Advertisement

తాజా వార్తలు