బురదలో దొర్లుతున్న కొత్త జంట.. ఏమిటో ఈ పైత్యం!

కొత్తగా పెళ్లి చేసుకునే జంట తమ నూరేళ్ల జీవితంపై కోటి ఆశలతో ముందడుగు వేస్తారు.

ఈ క్రమంలో తమ పెళ్లి వేడుకను ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని వినూత్న ప్రయత్నాలు చేస్తుంటారు.

ఇటీవల కాలంలో ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ అంటూ ఓ ట్రెండ్ బాగా నడుస్తోంది.పెళ్లికి ముందే వధువు, వరుడు కలిసి ఫోటోలు దిగడం, వీడియోలు తీయడం లాంటివి చేస్తుంటారు.

ఈ ఫోటోషూట్‌లు చాలా వినూత్నంగా ఉండేలా ఫోటోగ్రాఫర్లు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు.కాగా తాజాగా కేరళలోని ఓ జంట చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో పిచ్చ వైరల్‌గా మారింది.

పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు అనడంతో వారికి అది మరో రకంగా అర్ధం అయినట్లు ఉంది.వారు ఏకంగా పంట పొలంలోనే తమ వెడ్డింగ్ ఫోటోషూట్‌ను ప్లాన్ చేశారు.

Advertisement

అలా అని పచ్చని పంట పొలంలో కాదండోయ్.ఏకంగా బురద పొలంలో వారు తమ వెడ్డింగ్ ఫోటోషూట్‌ను చేశారు.

బురదలో దొర్లుతూ వారు చేసిన విన్యాసాలు చూసి నెటిజన్లు వారిపై అదిరిపోయే కామెంట్లు వేస్తున్నారు.కొందరు వారి ప్రయత్నాన్ని పొగిడేస్తుంటే, మరికొందరు మాత్రం వారిని తిట్టిపోస్తున్నారు.

ఫోటోషూట్ చేసుకునేందుకు ఇంకా ఎక్కడ స్థలమే లేనట్లు ఆ బురదలో దొర్లడం ఏమిటని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఏదేమైనా ఈ జంట చేసిన ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ జంట ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఇలాంటి ఫోటోషూట్‌లు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో ఏమో అని మరికొంతమంది ముక్కున వేలేసుకుంటున్నారు.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..
Advertisement

తాజా వార్తలు