Bihar Police news: వాళ్లంతా పోలీసులు. విధుల్లో అలసత్వం ప్రదర్శించడంతో శిక్ష అనుభవించాల్సి వచ్చింది.
అది కూడా సొంత స్టేషన్ లోనే 2 గంటల పాటు లాకప్ లో శిక్ష అనుభవించాల్సి వచ్చింది.బిహార్ లోని నవాదాలో జరిగిన ఈ ఘటన కాసేపట్లోనే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగిందంటే.విధి నిర్వహణలో భాగంగా.
బిహార్ లోని నవాదా పోలీస్ స్టేషన్ కు వచ్చాడు.గురువారం రాత్రి వచ్చిన ఎస్పీ గౌరవ్.
స్టేషన్ లో ఉన్న సిబ్బందిని డైరీ అడిగాడు.అందులో వివరాలేవీ అప్ డేట్ చేసి లేవని ఆగ్రహించిన ఎస్పీ.
వారిపై గట్టి గట్టిగా అరిచారు.తర్వాత వారిని లాకప్ లో పెట్టి బంధించారు.
సొంత స్టేషన్ లోనే నిందితుల్లా సెల్ ఉండాల్సి రావడం వల్ల నవాదా నగర పోలీస్ స్టేషన్ సిబ్బంది షాక్ అయ్యారు.
ఎట్టకేలకు రెండు గంటల తర్వాత వీరిని బయటకు పంపించారు.
ఈ దృశ్యాలన్నీ పోలీస్ స్టేషన్ లోని సీసీటీవి కెమెరాల్లో రికార్డు అయ్యాయి.ఎస్పీ గౌరవ్ మంగళ తీరుపై బిహార్ పోలీసు అసోసియేషన్ మండి పడింది.
ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని నవాదా స్టేషన్ సిబ్బందిపై ఎస్పీ ఒత్తిడి చేస్తున్నారని అసోసియేషన్ అధ్యక్షుడు మృత్యుంజయ్ సింగ్ ఆరోపించారు.స్టేషన్ లోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఫుటేజీని ఆధారంగా తీసుకొని గౌరవ్ మంగళపై కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.