యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ గురించిన అప్డేట్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను ఎప్పుడు పట్టాలెక్కిస్తాడో అని వారు మరింత ఆసక్తిగా ఉన్న సంగతి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
కాగా ఈ సినిమా తరువాత ప్రభాస్ ఇప్పటికే మూడు సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే.
అందులో మొదటిగా దర్శకుడు నాగ్ అశ్విన్తో ఓ సైన్స్ ఫిక్షన్ చేయబోతున్నట్లు ప్రకటించిన ప్రభాస్, ఆ తరువాత ఆదిపురుష్, సలార్ చిత్రాలను వరుసబెట్టి ఓకే చేస్తూ తన స్పీడును చూపిస్తున్నాడు.
ఇక ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్తో ప్రభాస్ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందో అనే సందేహం అందరిలో నెలకొంది.కాగా ఇప్పటికే ఆదిపురుష్, సలార్ చిత్రాలను పట్టాలెక్కించే యోచనలో ప్రభాస్ ఉన్నాడని, ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక గాని నాగ్ అశ్విన్తో సినిమా చేయడేమో అనే సందేహం వారిలో నెలకొంది.
అయితే ఈ విషయంపై దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా ఓ హింట్ ఇచ్చాడు.
ఓ అభిమాని ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రారంభం అవుతుందేమో అని సందేహం వ్యక్తం చేయడంతో, ఈ విషయంపై నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు.
జనవరి 29న ఒకటి, ఫిబ్రవరి 26న ఈ సినిమాకు సంబంధించి రెండు అప్డేట్లు ఉండబోతున్నట్లు నాగ్ అశ్విన్ తెలిపాడు.అయితే జనవరి 29న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభోత్సవం, ఫిబ్రవరి 26న ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్కు సంబంధించిన అప్డేట్ చిత్ర యూనిట్ తెలియజేస్తుందేమో అని చిత్ర వర్గాలు అంటున్నాయి.
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయనుంది.మరి ఈ సినిమా నుండి రాబోతున్న రెండు అప్డేట్లు ఏమిటో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.