ఏపీ విద్యాశాఖ మంత్రి పై నాదెండ్ల మనోహర్ సీరియస్..!!

జనసేన పార్టీ పొలిటికల్ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పై మండిపడ్డారు.

సంక్రాంతి సెలవుల అనంతరం స్కూలు యదావిధిగా ఉంటుందని తెలియజేస్తూ .

ఎటువంటి సెలవులు లేవని.ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇవ్వడం జరిగింది.

Nadendla Manohar Serious On Adhimulapu Suresh Details, Nadendla Manohar, Adhimu

మరోపక్క దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు.పాఠశాలలకు సెలవు ప్రకటించడం జరిగింది.

ఈ తరుణంలో ఏపీలో పాఠశాలలు ఓపెన్ చేయడం పట్ల.నాదెండ్ల మనోహర్ సీరియస్ అయ్యారు.

Advertisement

విద్యార్థుల ప్రాణాలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు.? కేసులు పెరిగితే చూద్దామని విద్యాశాఖ మంత్రి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు అంటూ సీరియస్ అయ్యారు.విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమంత్రికి దూరదృష్టి లోపించిందని చెప్పుకొచ్చారు.

ఈ నెలాఖరు వరకు విద్యాసంస్థలు బంద్ చేస్తే విద్యార్థులను కరోనా నుండి.కాపాడుకో కలిగిన వారిమి అవుతామని.స్పష్టం చేశారు.

దేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థలు మూసివేసి ఆన్లైన్ విధానం ద్వారా.తరగతులు నిర్వహిస్తున్నాయి ఇటు వంటి ప్రమాదకర సమయంలో ఏపీ ప్రభుత్వం పాఠశాలలు ఓపెన్ చేయడం బాధ్యతారహితమైన నిర్ణయం అని నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు