నాంది చిత్రంతో అల్లరోడు కూడా అదే బాటలో?

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న అల్లరి నరేష్, ఇప్పటికే వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు.

ఇక ఈ హీరో కామెడీ జోనర్ చిత్రాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.

అయితే కొంతకాలానికి వరుసగా ఫెయిల్యూర్ చిత్రాలతో ఫేడవుట్ అవుతూ వచ్చిన ఈ హీరో ఇప్పుడు క్యారెక్టర్ పాత్రలు చేస్తూ వస్తున్నాడు.ఇక అల్లరి నరేష్ నటిస్తు్న్న తాజా చిత్రం నాంది, ఇప్పటికే చివరిదశ షూటింగ్‌కు చేరుకుంది.

కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్న ఈ సినిమాలో అల్లరి నరేష్ చాలా సీరియస్ పాత్రలో నటిస్తున్నాడు.ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరో, నాంది చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.

ఇక ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.

Advertisement

కాగా ఇప్పుడు ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది.ఇందులో భాగంగా జీ5 నాంది చిత్ర హక్కులను సొంతం చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

దీంతో ఈ సినిమాను త్వరలోనే జీ5 రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.

ఇక లేడీ విలన్‌గా మెప్పించిన వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో లాయర్ పాత్రలో నటిస్తోంది.ఆమె నటన ఈ సినిమాకు అదనపు బలం కానుంది.

మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర అలరిస్తుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

ఆ ఒక్కరు తప్ప మిగతా కంటెస్టెంట్లు వేస్ట్.. 12 మంది తీసుకురావడమే బెటర్..?
Advertisement

తాజా వార్తలు