తల్లి వివాహేతర సంబంధానికి 12 ఏళ్ల కూతురు అడ్డుగా ఉండడంతో.. ఏం చేశారంటే..?

ఇటీవలే కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా కడుపున పుట్టిన సొంత పిల్లలనే విచక్షణారహితంగా చంపేస్తున్నారు.

కేవలం శారీరక సుఖం కోసం తమ కుటుంబాలను తామే నాశనం చేసుకుంటున్నా రోజులు ఇవి.

ఇలాంటి కోవకు చెందిన ఓ ఘటన ఖమ్మం జిల్లాలో( Khammam ) వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకెళితే ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు గోల్తాండా లో బానోత్ గంగా, బీకూ( Banoth Ganga, Bikoo ) అనే దంపతులు నివసిస్తున్నారు.వీరికి శ్రీవల్లి( Srivalli ) (12), చరణ్( Charan ) అనే పిల్లలు సంతానం.అయితే కొంతకాలం క్రితం బీకూ ను వదిలేసి వినోద్ అనే వ్యక్తితో గంగా ఖమ్మంలో సహజీవనం చేస్తోంది.

ఖమ్మంలోని చర్చి కాంపౌండ్ సమీపంలో తన ఇద్దరు పిల్లలతో పాటు ఉంటూ వైన్ షాపు వద్ద జొన్న రొట్టెలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది.

Advertisement

శ్రీవల్లి ఆరవ తరగతి చదువుతోంది.అయితే సోమవారం ఉదయం గంగా రోజు మాదిరిగానే పని కోసం బయటకు వెళ్ళింది.కాసేపటికి కింది అంతస్తులు ఉండే మహిళ గంగా ఇంటికి వెళ్లి చూస్తే ఫ్యాన్ కు శ్రీవల్లి వేలాడుతూ కనిపించడంతో బిగ్గరగా కేకలు వేసింది.

ఆ మహిళ కేకలకు చుట్టుపక్కల వారంతా వచ్చి శ్రీవల్లిని కిందికి దించి గంగాకు సమాచారం ఇచ్చారు.అపస్మారక స్థితిలో ఉన్న శ్రీవల్లికి స్థానిక హోంగార్డు రవి సీపీఆర్ చేసి జిల్లా ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మధ్యలోనే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

శ్రీవల్లి మృతి చెందిన వార్త తండ్రి బీకూకు, బంధువులకు తెలియడంతో హాస్పటల్ కు చేరుకుని గంగపై దాడి చేసి, తన ప్రియుడితో సహజీవనానికి అడ్డుగా ఉండడంతో పథకం ప్రకారం అడ్డు తొలగించుకునేందుకు హత్య చేసిందని ఆరోపించారు.గంగా కుమారుడు చరణ్ ను కూడా వినోద్ తీవ్రంగా కొట్టడంతో నెల రోజుల క్రితం తండ్రి వద్దకు వెళ్లాడు.గంగా ఇంట్లో దొరికిన ఒక లెటర్ లో నాకు బతకాలని లేదు అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా అని రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

శ్రీవల్లిని బలవంతంగా కొట్టి రాయించారో లేదంటే వినోద్ రాసి ఉంటాడని బీకూ, బంధువులు ఆరోపించారు.బీకూ ఇచ్చిన ఫిర్యాదుతో గంగ, వినోద్ ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.

ఐబ్రోస్ దట్టంగా పెరగాలా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
Advertisement

తాజా వార్తలు