కృష్ణా జిల్లాలో మోహన్ బాబు పర్యటన..!!

టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నీ కలిసే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

గన్నవరం విమానాశ్రయం చేరుకున్న మోహన్ బాబుకి అభిమానులు ఘన స్వాగతం పలికారు.పర్యటనలో భాగంగా ఇటీవల మరణించిన ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తల్లి రంగనాయకమ్మ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని  మోహన్‌బాబు పరామర్శించారు.

ఈ రోజు పెదపారుపూడి మండలం వానపాముల గ్రామంలోని యార్లగడ్డ నివాసానికి మోహన్ బాబు చేరుకున్నారు.ఆయన తల్లి రంగనాయకమ్మ విగ్రహానికి నివాళి అర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులందరిని పరామర్శించారు.

అనంతరం మీడియాతో మోహన్ బాబు మాట్లాడుతూ యార్లగడ్డ తనకు అత్యంత ఆప్తుడని చెప్పారు.ఆయన తల్లిని కోల్పోవడం తనను కలచి వేసిందని అన్నారు.

Advertisement

రంగనాయకమ్మ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాననితెలియజేశారు.ఇదే సమయంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంలో తీసుకున్న నిర్ణయాల గురించి ముఖ్యమంత్రి జగన్ తో మోహన్ బాబు చర్చించనున్నట్లు సమాచారం.2019 లో ఎలక్షన్ సమయంలో వైసీపీకి మోహన్ బాబు మద్దతు తెలిపి.ఎన్నికల ప్రచారంలో కీలకంగా రాణించారు.

ఈ నేపథ్యంలో జగన్.మోహన్ బాబుకి కీలక పదవి ఒకటి ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు