మెగాస్టార్ తో గొడవపై స్పందించిన మోహన్ బాబు.. ఆ బాధ ఇప్పటికీ ఉందంటూ..

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో తన విలక్షణ నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని కలెక్షన్ కింగ్ గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు మంచు మోహన్ బాబు(Mohan Babu).

చిత్తూరు జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో జన్మించిన మోహన్ బాబు సినీ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి ఆ తర్వాత నటుడిగా అవకాశాలు అందుకుని అంచలంచెలుగా ఎదిగారు.ఆ తర్వాత తర్వాత తన నటనతో హీరోగా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు.

హీరోగా మాత్రమే కాదు మంచి మంచి రోల్స్ ద్వారా తన నటనా టాలెంట్ ను బయట పెట్టారు.అయితే ఈ మధ్యకాలంలో మంచు ఫ్యామిలీ సినిమాల వల్ల పాపులర్ అయిన దాని కంటే ట్రోల్స్ ద్వారానే పాపులర్ అవుతున్నారు.

వీరి కుటుంబంపై ఈ మధ్య ఏ చిన్న విషయం వచ్చిన విపరీతమైన ట్రోల్స్ చేస్తుండడం చూస్తూనే ఉన్నాం.

Advertisement

ఇదిలా ఉండగా మోహన్ బాబు తన కెరీర్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు పడ్డ కష్టాల గురించి అవమానాల గురించి ఎన్నో విషయాలను తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.ఈ క్రమంలోనే వజ్రోత్సవాల్లో జరిగిన వివాదంపై కూడా ఈయన స్పందించారు.ఈ సందర్భంగా మెగాస్టార్ (Chiranjeevi)తో తనకు ఎలాంటి విభేదాలు లేవని మోహన్ బాబు మరోసారి తెలిపారు.

ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు?.ఐతే ఆ బాధ ఇప్పటికీ నా మనసులో ఉందని.అలా ఎందుకు జరిగింది? ఇందులో తప్పు ఎవరిదీ? నా తప్పా? లేదంటే తన తప్పా? అనేది ఇప్పుడు మాట్లాడాలి అని అనుకోవడం లేదని ఆ సంఘటన తర్వాత చిరంజీవి నేను ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాము అని అసలు మా మధ్య ఏమీ లేదని.ఏదో ఉందని బయట ప్రచారం చేయడమే అని మోహన్ బాబు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు