ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

బండి సంజయ్ తన పదవికి మచ్చ తెచ్చేలా మాట్లాడుతున్నారని అన్నారు.

ప్రధాని మోదీ నుంచి సంజయ్ వరకు మహిళలను అపహేళన చేసే విధంగా మాట్లాడుతారని ఆరోపించారు.బెంగాల్ లో మమతను మోదీ హేళన చేస్తే ఏం జరిగిందో తెలియదా అని ప్రశ్నించారు.

సరైన సమయంలో బీజేపీకి ప్రజలు తగిన బుద్ది చెప్తారని తెలిపారు.బండి సంజయ్ తనని మాత్రమే కాదని బతుకమ్మను అవమానించారని తెలిపారు.

గతంలో బతుకమ్మను ఎత్తుకోవడానికి భయపడిన వాళ్లు ఇప్పుడు అవమానిస్తున్నారని విమర్శించారు.బీజేపీ వ్యతిరేక కూటములను ఏకం చేస్తామని వెల్లడించారు.

Advertisement
అమెరికా అధ్యక్ష ఎన్నికలు : కమల, ట్రంప్‌లలో గెలుపెవరిది.. యూఎస్ నోస్ట్రాడమస్ ఏం చెప్పారంటే?

తాజా వార్తలు