దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) నిందితురాలిగా ఉన్నారని తెలుస్తోంది.
మద్యం కుంభకోణం నిందితుల స్టేట్ మెంట్స్ ఆధారంగా కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిందని సమాచారం.
ఈ నెల 26న విచారణకు ఢిల్లీలో సీబీఐ( CBI ) హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.అయితే ఈ కేసులో కీలక నిందితులు అఫ్రూవర్లుగా మారిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, కవిత పీఏ అశోక్ కౌశిక్ ఇచ్చిన సమాచారం ఆధారంగా సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించనున్నారు.