Vasantha krishna Prasad : టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్..!!

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్( Mylavaram MLA Vasantha Krishnaprasad ) టీడీపీలో చేరారు.

పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ( TDP ) తీర్థం పుచ్చుకున్నారు.

ఈ క్రమంలో వసంత కృష్ణప్రసాద్ కు పార్టీ కండువా కప్పి చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు.అనంతరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రతిపక్ష నేతలను తిడితేనే వైసీపీలో పదవులు వస్తాయని ఆరోపించారు.

మైలవరం టికెట్( Mylavaram Ticket ) ఇస్తామని చెపుతూనే చంద్రబాబును, లోకేశ్ ను వ్యక్తిగతంగా దూషించాలని చెప్పారని ఆరోపణలు చేశారు.అలాగే టీడీపీ నేత దేవినేని ఉమ( Devineni Uma )తో వ్యక్తిగత ద్వేషాలు లేవన్న వసంత కృష్ణప్రసాద్ ఇద్దరం కలిసి కూర్చొని అన్నీ మాట్లాడుకుంటామని తెలిపారు.

Advertisement
బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ ‘వాక్యం’ చెప్పుకుంటూ జనాలని ‘గొర్రెల కాపరి దారి’లో నడిపించడమే మేలు?

తాజా వార్తలు