చంద్రబాబుపై మంత్రి బొత్స మండిపాటు

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.వర్షాలపై ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులను అలర్ట్ చేశామని తెలిపారు.

రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చంద్రబాబు అంటున్నారన్న మంత్రి బొత్స రైతుల ఆవేదన సీఎంవో దృష్టికి వచ్చిన వెంటనే స్పందించారని వెల్లడించారు.ఈ క్రమంలోనే తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారన్నారు.

ప్రత్యేక అధికారులు జిల్లాలకు వెళ్లి నష్టపోయిన పంటలను పరిశీలిస్తున్నారని తెలిపారు.

పోలీసులకు ఫిర్యాదు వల్ల రాజ్ తరుణ్ కెరీర్ కు ఇబ్బందేనా.. కొత్త ఆఫర్లు సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు