విశాఖలో పారిశ్రామిక సదస్సు ఏర్పాట్లపై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

ఈనెల మూడు నాలుగు తారీకులలో విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామిక సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమానికి దాదాపు 25 దేశాల నుంచి ప్రముఖులు వస్తున్నట్లు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.

 Minister Amarnath's Key Comments On The Arrangements For The Industrial Conferen-TeluguStop.com

అంతేకాదు ముఖేష్ అంబానీ, కుమార్ మంగళం బిర్లా, కరణ్ ఆదాని…లాంటి కుబేరులు కూడా హాజరవుతున్నట్లు స్పష్టం చేశారు.రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో అత్యధిక పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అన్నారు.

దేశంలో ఎక్కడా లేనంతగా 70 శాతం స్కిల్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందని పేర్కొన్నారు.

రాష్ట్రానికి విశాఖ నగరం భవిష్యత్తుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. 25 దేశాల ప్రముఖులతో పాటు దేశంలో దిగ్గజ వ్యాపార కుబేరులకు నగరంలో వివిధ హోటల్స్ నందు బస ఏర్పాటు చేసినట్లు మంత్రి అమర్నాథ్ తెలియజేశారు.ఈ సదస్సుకు సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ లో జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు.ఈ క్రమంలో 25 ప్రత్యేక విమానాలు విశాఖకు రాబోతున్నాయని.18 విమానాలను విశాఖ విమానాశ్రయంలో పార్క్ చేసే అవకాశం ఉందని అన్నారు.మిగిలిన విమానాలు రాజమండ్రి, విజయవాడ ప్రాంతాలకు తరలించనున్నట్లు స్పష్టం చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం రాత్రి 8 గంటలకు విశాఖ చేరుకుంటారని పేర్కొన్నారు.మూడవ తారీకు ఉదయం ఆయన వేదిక వద్దకు వచ్చి ఎగ్జిబిషన్ ని తిలకిస్తారని ఆ తర్వాత ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తారని స్పష్టం చేశారు.రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube