చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను రేపు ప్రస్తావించండి..: సీజేఐ ధర్మాసనం

టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను రేపు ప్రస్తావించాలని సుప్రీం ధర్మాసనం తెలిపింది.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను చంద్రబాబు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

 Mention Chandrababu Quash Petition Tomorrow..: Cji Bench-TeluguStop.com

ఇందులో భాగంగా చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా సీజేఐ ముందు క్వాష్ పిటిషన్ ను ప్రస్తావించారు.ఈ క్రమంలోనే ఇది ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యవహారమని చెప్పారు.

ఏపీలో ప్రతిపక్షాలను అణిచి వేస్తున్నారని సిద్దార్థ్ లూథ్రా ధర్మాసనానికి తెలిపారు.దీనిపై చంద్రబాబు ఎన్ని రోజుల నుంచి కస్టడీలో ఉన్నారని సీజేఐ ప్రశ్నించారు.

ఈనెల 8న చంద్రబాబును అరెస్ట్ చేశారని లూథ్రా చెప్పగా రేపు మెన్షన్ లిస్ట్ ద్వారా రావాలని సీజేఐ సూచించింది.ఈ మేరకు విచారణ తేదీని సుప్రీంకోర్టు రేపు ఖరారు చేసే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube