టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను రేపు ప్రస్తావించాలని సుప్రీం ధర్మాసనం తెలిపింది.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను చంద్రబాబు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇందులో భాగంగా చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా సీజేఐ ముందు క్వాష్ పిటిషన్ ను ప్రస్తావించారు.ఈ క్రమంలోనే ఇది ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యవహారమని చెప్పారు.
ఏపీలో ప్రతిపక్షాలను అణిచి వేస్తున్నారని సిద్దార్థ్ లూథ్రా ధర్మాసనానికి తెలిపారు.దీనిపై చంద్రబాబు ఎన్ని రోజుల నుంచి కస్టడీలో ఉన్నారని సీజేఐ ప్రశ్నించారు.
ఈనెల 8న చంద్రబాబును అరెస్ట్ చేశారని లూథ్రా చెప్పగా రేపు మెన్షన్ లిస్ట్ ద్వారా రావాలని సీజేఐ సూచించింది.ఈ మేరకు విచారణ తేదీని సుప్రీంకోర్టు రేపు ఖరారు చేసే అవకాశం ఉంది.