రీ ఎంట్రీ ఇస్తున్న మహేష్ బాబు అక్క.. ఫస్ట్ లుక్ రిలీజ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని అందరికీ గుర్తుండే ఉంటుంది.

ఒకప్పుడు నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా పలు సినిమాలు చేసిన మంజుల దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.

అయితే తాజాగా ఈమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే సుమంత్, నైనా జంటగా నటిస్తున్నటువంటి "మళ్ళీ మొదలైంది" సినిమా ద్వారా మంజుల వెండితెరపై సందడి చేయనున్నారు.

ఈ సినిమాలో మంజుల "డాక్టర్ మిత్ర"-థెరపిస్ట్ పాత్రలో నటిస్తున్నట్లు స్వయంగా మంజుల ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఈ క్రమంలోనే ఈమె ఈ సినిమా విడుదల తేదీపై ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అంటూ తెలియజేశారు.

ఈ సినిమా పెళ్లి తర్వాత విడాకులు తీసుకున్నా ఆ తర్వాత జీవితం ఎలా ఉంటుంది అనే కథాంశంతో ద్వారా తెరకెక్కింది.ఈ చిత్రంలో సుహాసిని, వెన్నెలకిషోర్ కీలక పాత్రలో నటించనున్నారు.

Advertisement

తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.సినిమా ఇండస్ట్రీలోకి మంజుల 1998లో "స‌మ్మ‌ర్ ఇన్ బెత్తెహామ్" సినిమా ద్వారా వెండితెరకు  పరిచయమయ్యారు.ఈ క్రమంలోనే పలు సినిమాలలో నటించి నిర్మాణ బాధ్యతలను కూడా చేపట్టారు.

ఇక మంజుల చివరిగా 2013లో సేవకుడు చిత్రం ద్వారా సందడి చేశారు.అప్పటినుంచి ఇండస్ట్రీకు దూరంగా ఉన్న మంజుల తిరిగి మళ్ళీ మొదలైంది సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు