మంచు లక్ష్మి ఓ సినిమా చేస్తోంది... జనాల రియాక్షన్‌ ఎలా ఉంటుందో!

ఈ మధ్య కాలంలో మంచు ఫ్యామిలీకి అస్సలు కలిసి రావడం లేదు.

మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా సినిమా కనీసం కోటి రూపాయల కలెక్షన్స్ రాబట్టలేక పోయింది.

ఇక మంచు విష్ణు హీరో గా నటించిన జిన్నా సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని మూట కట్టుకుంది.కలెక్షన్స్ రాకున్నా పర్వాలేదు కానీ సోషల్ మీడియా లో దారుణమైన ట్రోల్స్ ని ఈ సినిమాలు ఎదుర్కొన్నాయి.

గతం లో ఏ హీరోలు కూడా ఎదుర్కోని ట్రోల్స్ ని ప్రస్తుతం మంచు హీరో లు ఎదుర్కొంటున్న నేపథ్యం లో వారి ఇంటికే చెందిన మంచు లక్ష్మి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న నేపథ్యంలో మరింత ఆసక్తి కనిపిస్తోంది.అగ్ని నక్షత్రం అనే టైటిల్ తో రూపొందిన సినిమా తో మంచు లక్ష్మి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమంత చేతుల మీదుగా ఈ సినిమా నుండి తెలుసా తెలుసా అనే పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా మంచు లక్ష్మి అధికారికంగా ప్రకటించింది.

Advertisement

ఈ సినిమా కు వంశీకృష్ణ మల్లా దర్శకత్వం వహించారు.అచ్చు రాజమణి సంగీతాన్ని అందిస్తున్నారు.ఇప్పటి వరకు సినిమా విడుదల తేదీ పై ఎలాంటి ప్రకటన రాలేదు, కానీ త్వరలోనే ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా మంచు లక్ష్మి పేర్కొన్నారు.

సినిమా యొక్క టాక్ ప్రస్తుతానికి పాజిటివ్ గా ఉంది.కానీ ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది ఇప్పుడే చెప్పలేం.

సినిమా బాగుంటే పర్వాలేదు కానీ నెగటివ్ టాక్ దక్కించుకుంటే మాత్రం జనాల రియాక్షన్ ముఖ్యంగా సోషల్ మీడియా జనాల రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మోహన్ బాబు మరియు విష్ణు లకు ఎదురైన సోషల్ మీడియా ట్రోల్స్ మంచు లక్ష్మి కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.అయితే మంచు లక్ష్మి ఈ సినిమా తో సక్సెస్ సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆమె సన్నిహితులు అంటున్నారు.

ఏకంగా హీరోనే డామినేట్ చేసిన టాలెంటెడ్ యాక్టర్స్.. ఎవరంటే..? 
Advertisement

తాజా వార్తలు