విచిత్రం ఏమిటోగాని, దేశంలోని వింత వింత మనుషులందరూ రాజధాని ఢిల్లీలోనే ఉంటారెందుకని? అని జనాలు అడుగుతున్నారు.ఎందుకంటే ఇపుడు ఎవరూ చేయని వింత వింత పనులు చేసి సెలిబ్రిటీలు అయిపోవడం, వీడియోలు తీసి సోషల్ మీడియాలో( Social Media ) షేర్ చేయడం.
బాగా ఎక్కువైపోయాయి.సోషల్ మీడియా వినియోగం పెరిగాక ఇలాంటి స్టఫ్ ఎక్కువైపోయింది.
సాధారణంగా చాలా రష్ గా ఉన్నప్పుడు కూర్చోవడానికే చోటు దొరకని మెట్రోలో ఓ వ్యక్తి పరుపు వేసుకుని మరీ నిద్రపోవడం ఇప్పుడు వైరల్ మారింది.
అవును, దేశ రాజధాని ఢిల్లీ మెట్రోలో ఈ సంఘటన చోటుచేసుకోవడం విశేషం.ఢిల్లీ మెట్రోలో( Delhi Metro ) రోజుకో వీడియో వైరల్ కావడం మనం చూస్తూ వున్నాం.ఆమధ్య కాలంలో ఓ అమ్మాయి వేసుకున్న వస్త్రధారణపై సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ జరగడం మరిచిపోకముందే ఈ సంఘటన వెలుగు చూసింది.
ఆ మెట్రోలో జరిగిన ఓ సంఘటన బయటకు రావడంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు.నిలబడటానికే చోటు దొరకని మెట్రోలో ఓ కుర్రాడు బెడ్ పరుచుకుని మరీ నిద్రపోయాడు.ప్రిన్స్ జీ( Princezee ) అనే కుర్రాడు వింత ప్రవర్తన చూసి తోటి ప్యాసింజర్లు నవ్వుకున్నారు.
ఆ కుర్రాడు తన వెంటన ఓ బెడ్ ను తెచ్చుకొని నెమ్మదిగా దానిని పరుచుకుని బెడ్ పై ప్రశాంతంగా నిద్రపోయాడు.అంతమంది చూస్తున్నా ఏ మాత్రం బెరుకులేకుండా అతను బెడ్ పరుచుకుని పడుకున్న విధానం చూసి తోటి ప్రయాణికులు అయితే బిత్తరబోయారు.ఈ వీడియో క్లిప్ ప్రిన్స్ జీ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
ఈ క్రమంలో మెట్రోలో ఇలాంటివి జరుగుతుంటే జనం పట్టించుకోరేంటి? అని కొందరు.ప్రశ్నిస్తుంటే, అతని ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకుంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.
కాగా కొంతమంది అతగాడు కావాలనే అలా చేసాడని, కేవలం తన యూట్యూబ్ ఛానల్ కోసమే అలా చేసాడని కామెంట్స్ పెడుతున్నారు.