యంగ్ హీరోల్లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) ఒకరు.విజయ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దీ సమయంలోనే భారీ ఫాలోయింగ్ ను ఏర్పరుచు కున్నాడు.
అర్జున్ రెడ్డి, గీతా గోవిందం వంటి సినిమాతో భారీ ఫాలోయింగ్ అందుకున్న విజయ్ ఆ తర్వాత భారీ లైనప్ ను సెట్ చేసుకున్నాడు.అయితే గత రెండు సినిమాలు విజయ్ కు ప్లాప్ నే ఇచ్చాయి.
ముఖ్యంగా ఎన్నో అంచనాల మధ్య పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయిన విజయ్ మొదటి పాన్ ఇండియన్ మూవీ ”లైగర్” సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.ఈ సినిమా ఇచ్చిన షాక్ నుండి ఇప్పుడిప్పుడే బయట పడి విజయ్ తన నెక్స్ట్ లైనప్ ను ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్ గా సెట్ చేసుకుంటున్నాడు.
ప్రెజెంట్ విజయ్ దేవరకొండ లైనప్ లో ఉన్న సినిమా ‘ఖుషీ’.
ఈ సినిమాను శివ నిర్వాణ ( Shiva Nirvana ) డైరెక్టర్ చేస్తున్నాడు.సమంత, విజయ్ కలిసి జంటగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధం అవుతుంది.ఈ సినిమా తర్వాత విజయ్ సుకుమార్ తో ఒక సినిమా, గౌతమ్ తిమ్మనూరితో మరో సినిమా చేస్తున్నాడు.
అలాగే విజయ్ కు గీతా గోవిందం వంటి ఘన విజయం అందించిన పరశురామ్ తో కూడా ఒక సినిమా ఉందని ప్రకటించాడు.
ఈ సినిమా గీతా గోవిందం సినిమాకు సీక్వెల్ నా లేదంటే కొత్త సబ్జెక్ట్ తో తెరకెక్కుతుందా అనే విషయం ప్రస్తుతానికి ఇంకా రివీల్ చేయలేదు.అయితే తాజాగా ఈ సినిమాకు హీరోయిన్ ఫిక్స్ అయ్యింది అంటూ వార్తలు వస్తున్నాయి.విజయ్ తో జనగణమన సినిమా చేయాల్సిన పూజా హెగ్డే( Pooja Hegde )తో సినిమా ఆగిపోవడంతో ఈ సినిమాకు ఈమెను రికమెండ్ చేసున్నత్ తెలుస్తుంది.
మరి ఇదే నిజమైతే పూజా హెగ్డేతో విజయ్ రొమాన్స్ ఖాయం అయ్యేట్టుగానే ఉంది.చూడాలి దీనిపై ఎలాంటి డీటైల్స్ వస్తాయో.