సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి డైరెక్షన్ లో చేసే సినిమాతో గ్లోబల్ స్టార్ అవుతాడని అంటున్నారు రైటర్ పద్మభూషణ్ నిర్మాత శరత్ చంద్ర అనురాగ్ రెడ్డి.సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమాను షణ్ముఖ ప్రశాంత్ డైరెక్ట్ చేశారు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత మాట్లాడుతూ సినిమా ప్రమోషన్స్ చేయడం తో స్టార్స్ తో మంచి పరిచయం ఉందని.మహేష్ బాబుతో దాదాపు 7, 8 ఏళ్లుగా కొలాబరేషన్ లో ఉన్నామని అన్నారు.
మహేష్ నిర్మించిన మేజర్ సినిమాకు భాగస్వామ్యం అయినట్టు చెప్పారు.
ఇక మహేష్ రాజమౌళి సినిమాతో గ్లోబల్ స్టార్ అవుతాడని.ఆ సినిమా తర్వాత మహేష్ హాలీవుడ్ స్టార్ గా పిలవబడతారని అన్నారు శరత్ చంద్ర.ఆర్.ఆర్.ఆర్ తోనే రాజమౌళి బీభత్సం సృష్టించగా ఈసారి మహేష్ సినిమాతో పక్కగా ఆస్కార్ డైరెక్ట్ నామినేట్ అయ్యేలా ప్రయత్నించే ఛాన్స్ ఉంది.రాజమౌళితో మహేష్ సినిమా ఇన్నేళ్లు ఎందుకు ఆగారో కానీ ఈ కాంబో కి ఇది పర్ఫెక్ట్ టైమింగ్ అని చెప్పొచ్చు.ఎలాగు యూనివర్సల్ సబ్జెక్ట్ తోనే రాజమౌళి ఈ సినిమా చేస్తున్నాడు కాబట్టి పక్కాగా ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ గురించి ఎలా ఇంటర్నేషనల్ లెవెల్ లో మాట్లాడుతున్నారో అప్పుడు మహేష్ సినిమా గురించి కూడా మాట్లాడే ఛాన్స్ ఉంది.