ప్రియుడు చనిపోయాడని తెలిసి వాళ్ళ ఇంటిముందే ప్రియురాలు ఆత్మహత్య..

యువత ఆవేశంలో నిర్ణయాలు తీసుకుని తమ నిండు జీవితాన్ని బలి చేసుకుంటుంది.ప్రేమ విఫలమైనా, తల్లి మందలించినా, లెక్చరర్ తిట్టాడని, పరీక్ష పాసవ్వకపోయినా .

ఇలా ప్రతి విషయానికి ఆత్మహత్య చేసుకుంటున్నారు.నిత్యం ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా కర్ణాటక రాష్ట్రంలో ఒక ఘటన జరిగింది.పెళ్ళికి ఒప్పుకోలేదని దీక్షిత్ అనే అబ్బాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

ప్రియుడు చనిపోయాడని తెలిసి వాళ్ళ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళింది.ప్రియుడు మరణించిన మూడు రోజులకు ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది.

Advertisement

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.పూర్తి వివరాల్లోకి వెళితే.

కర్ణాటక రాష్ట్రంలోని తమకూరు జిల్లా చిక్కనాయకహళ్లిలోని మారుతి నగర్ కు చెందిన దీక్షిత్, మండ్య జిల్లా ముద్దూరు పరిధిలోని కొప్ప గ్రామానికి చెందిన పంచాక్షరి కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.త్వరలో పెళ్ళి కూడా చేసుకోలనుకుంటున్నారు.

దీక్షిత్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.పెళ్ళికి ఇంట్లో వాళ్ళను ఒప్పిస్తానని చెప్పి స్వగ్రామానికి వెళ్ళాడు.

దీక్షిత్ ప్రేమ విషయాన్నీ ఇంట్లో వాళ్లకు చెప్పాడు.కానీ తన తల్లిదండ్రులు ఇద్దరి కులం ఒక్కటికాదని పెళ్ళికి ఒప్పుకోలేదు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

దీంతో కలత చెందిన దీక్షిత్ ఫిబ్రవరి 7 న ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు.పంచాక్షరికి ఈ విషయం గురించి ఆలస్యంగా తెలిసింది.

Advertisement

చిక్కనాయకహళ్లిలోని మారుతి నగర్ లో ఉన్న దీక్షిత్ ఇంటిని వెతుక్కుంటూ వచ్చింది.తర్వాత ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ దీక్షిత్ ఇంటి దగ్గరలోనే ఒక చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయింది.

ఈ విషయం తెలుసుకున్న పంచాక్షరీ తల్లిదండ్రులు అక్కడకు చేరుకున్నారు.పంచాక్షరిది ఆత్మహత్య కాదని హత్యని ఆరోపించారు.

ఈ ఘటనపై పోలీసులకు సమాచారమివ్వగా పోలీసులు అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తాజా వార్తలు