నామినేషన్ దాఖలు చేసిన కర్నూల్ వైసీపీ అభ్యర్థి ఏ.ఎండి.ఇంతియాజ్ ..

కర్నూల్ వైసీపీ అభ్యర్థి ఏ.ఎండి.

ఇంతియాజ్( Imtiaz ) తన నామినేషన్ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లోని ఆర్ఓ కార్యాలయంలో దాఖలు చేశారు.

స్వర్గీయ డా.ఇస్మాయిల్ స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి సర్వమత ప్రార్థనలు జరిపిన తర్వాత నగరంలోని జమ్మి చెట్టు ప్రాంతానికి చేరుకున్నారు.ఆయనతో పాటు కర్నూలు ఎమ్మెల్యే హఫీస్ ఖాన్,మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి,వైసీపీ నాయకులు అహమ్మద్ అలీఖాన్,కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బి.వై.రామయ్య,తదితరులు పాల్గొన్నారు.వచ్చే ఎన్నికల్లో కర్నూలు సీట్ ను వైసీపీ గెలవడం ఖాయమని ఇంతియాజ్ ధీమా వ్యక్తంచేశారు.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

తాజా వార్తలు