కోన ఆనంద్ గారికీ టీయూడబ్ల్యూజే(ఐజేయు) నివాళి

సీనియర్ జర్నలిస్ట్, భద్రాచలంకు చెందిన కోన ఆనంద్ కుమార్ శర్మ ఈరోజు మరణించారు.

ఆయన మరణం పట్ల టియుడబ్ల్యూజేఐజేయు జిల్లా కమిటీ తీవ్ర సంతాపం వెలిబుచ్చింది.

వార్త పత్రిక భద్రాచలం రిపోర్టర్గా ,ఖమ్మం బ్యూరోగా పనిచేసి ఆ తర్వాత ఎలక్ట్రాన్ మీడియాలో పని చేశారని, క్యాన్సర్ తో బాధపడుతూ శనివారం మరణించారని ఆయన మృతి పట్ల టి యు డబ్ల్యూ జె (ఐజేయు) జిల్లా కమిటీ తీవ్ర సంతాపం ప్రకటించింది.భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయం పై అనేక అక్రమాలను బయటకు తీశారని, చతిస్గడ్ మావోయిస్టు వార్తల్లో సేకరణలో ఎంతో ఎంతో నైపుణ్యం ఉందని టి యు డబ్ల్యూ జె ఐ జె యు రాష్ట్ర ఉపాధ్యక్షులు కే రామనారాయణ జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరావు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, కనకం సైదులు, ఖమ్మం నగర అధ్యక్ష కార్యదర్శులు మైస పాపారావు, చెరుకుపల్లి శ్రీనివాసరావు తదితరులు కొనియాడారు.

ఈ సందర్భంగా వారు ఆనంద్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

నా కాపురంలో చిచ్చు పెట్టాలని చూడకండి.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Latest Press Releases News