2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ రిపోర్టులో కీలక అంశాలు ఉన్నాయి.ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఆదాయం అంచనా రూ.2,21,687 కోట్లగా పేర్కొంది.
వచ్చిన ఆదాయం రూ.1,74,154 కోట్లు కాగా రెవెన్యూ లోటు రూ.9,335 కోట్లకు పెరిగిందని తెలిపింది.పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం రూ.1,09,992 కోట్లని వెల్లడించింది.కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్స్ రూ.8,619 కోట్లు, ప్రాణాళికేతర వ్యయం రూ.32,979 కోట్లు మరియు జీతాలకు రూ.30,951 కోట్లు, వడ్డీ చెల్లింపులు రూ.19,161కోట్లని తెలిపింది.మౌలిక వసతులకు చేసిన ఖర్చు రూ.28,308 కోట్లని కాగ్ రిపోర్ట్ వెల్లడించింది.