టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పాలకమండలి పలు నిర్ణయాలు తీసుకుంది.

ఇందులో భాగంగా అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణానికి రూ.4.17 కోట్లతో టెండర్లకు ఆమోదం తెలిపింది.రూ.2.35 కోట్లతో హెచ్వీసీ కాటేజీల నవీకరణతో పాటు తిరుమలలో రూ.40.50 కోట్లతో వేస్ట్ మేనేజ్ మెంట్ టెండర్లకు ఆమోదం తెలిపింది.అదేవిధంగా రూ.3.10 కోట్లతో తిరుమలలో డస్ట్ బిన్ల కోసం స్టీల్ స్టాండ్స్ ఏర్పాటుకు పాలకమండలి ఓకే చెప్పింది.అలాగే టీటీడీ కంప్యూటర్ల నవీకరణకు రూ.7.44 కోట్లు కేటాయింపు, టీటీడీ ఏడీ బిల్డింగ్ లో రికార్డు రూం నిర్మాణంతో పాటు రూ.97 కోట్లతో స్విమ్స్ లో అవసరమైన భవన నిర్మాణాలకు పాలకమండలి ఆమోద ముద్ర వేస్తూ నిర్ణయం తీసుకుంది.

Latest Nalgonda News