రాజమౌళి నుండి పిలుపు రాకపోయేసరికి...కీర్తి సురేష్ ఏం చేసిందో తెలుసా..?

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం గురించి అందరికి తెలిసిందే.

ఇటీవలే షూటింగ్ కూడా ప్రారంభమైంది.

ఈ చిత్రంలో ఇంకా హీరోయిన్లు ఎవరన్నది అధికారికంగా వెలువడలేదు.ఒక హీరోయిన్ కీర్తి సురేష్ అనే పేరు వినిపిస్తుంది.

ఈ సినిమా కోసం రాజమౌళి నుంచి పిలుపు వస్తుందనే కీర్తి సురేష్ ఎదురు చూసినట్లు ప్రచారం జరిగింది.

Advertisement

ఎదురు చూపులు ఫలించక పోవడం, మరో వైపు రజనీకాంత్‌తో చేసే అవకాశం దక్కడంతో కీర్తి సురేష్ ఫైనల్ నిర్ణయానికి వచ్చిందట.సూపర్ స్టార్ సినిమా మిస్సయితే ఇక జీవితంలో అలాంటి ఛాన్స్ రాదని, అందుకే మురుగదాస్ ప్రతి పాదనకు ఓకే చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో రజనీకాంత్ తన సినిమాల్లో రొమాంటిక్ డ్యూయోట్లు, సీన్లకు దూరంగా ఉంటున్నారు.తన వయసుకు తగిన విధంగా సినిమా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రజనీ ఆ మధ్య ఓ వేడుకలో స్వయంగా వెల్లడించారు.మరి అలాంటి రజనీకాంత్ సినిమాలో కీర్తి సురేష్ లాంటి యంగ్, హాట్ బ్యూటీ ఎంపిక కావడం చర్చనీయాంశం అయింది.

కబాలి లో సాయి ధన్సిక లాంటి పాత్రలో కీర్తి సురేష్ పాత్రను తెరకెక్కిస్తారు మురుగదాస్.? ఈ సినిమాలో రజినీకాంత్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారు అంట.

ఈ సింపుల్ రెమెడీతో చెప్పండి హెయిర్ బ్రేకేజ్ కు బై బై..!
Advertisement