ముగ్గురితో ఒకేసారి రోమాన్స్ చేస్తా అంటున్న హీరోయిన్

25 సంవత్సరాలుగా చూస్తున్నాం .అయినా ఖాన్ త్రయంలో ఉన్న మ్యాజిక్కే వేరు, ఇప్పటికి బోర్ కొట్టట్లేదు.

పాతిక సంవత్సరాలుగా జనం మెచ్చిన హీరోలుగా భారతీయ సినిమాను ఏలుతున్నారు ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్.ఏ హీరోతో వర్క్ చేస్తారు అని ఏ హీరోయిన్ ని అడిగినా, వీళ్ళ ముగ్గురిలో ఒకరిపేరు చెప్పాల్సిందే.

కాని అందరిలా రొటీన్ గా ఒక్క హీరో పేరే చెప్పట్లేదు కత్రీనా.తన కొత్తచిత్రం ఫితూర్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యులో పాల్గొన్న కత్రినా ఒక్కరి పేరు చెబితే మిగితా ఇద్దరు ఫీల్ అవుతారు అనుకుందో ఏమో .ముగ్గురిని రోమాన్స్ చేస్తా అని చెప్పింది.తప్పుదుగా .ముగ్గురితో ఇప్పటికే పని చేసింది.ముగ్గురు మంచి స్నేహితులే.

" ఆమీర్, సల్మాన్ , షారుఖ్ ముగ్గురితో మళ్ళి నటించాలని ఉంది.నిజం చెప్పాలంటే ముగ్గురితో ఒకే సినిమాలో నటించాలని ఉంది.

Advertisement

నా దగ్గర ఒక ఐడియా కూడా ఉంది.ఒక ఇంగ్లిష్ చిత్రాన్ని రీమేక్ చేయొచ్చు ఆ ముగ్గురిని, నన్ను పెట్టి.

ఓసారి ఊహించండి .ఆ ముగ్గురు ఒకే స్క్రీన్ పై కనబడడమే కాదు, ఒకే స్టేజి మీద ఒకే సినిమాను ప్రమోట్ చేస్తే ఎంత బాగుంటుందో" అంటూ చెప్పుకొచ్చింది కత్రినా.

కత్రినా కోరిక బాగానే ఉంది.

కాని ఆ ముగ్గురిని హీరోగా పెట్టి సినిమా నిర్మించాలంటే నిర్మాత ఆస్తులు అమ్ముకోవాలి.వాళ్ళ పారితోషికాలకే 150-200 కోట్లు అవుతుంది.

కుమార్తె వ్యాఖ్యలు.. వేదికపై కంటతడి పెట్టిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
బీట్‌రూట్ ఆకుల‌తో ఇలా చేస్తే.. ఊడిన జుట్టు మ‌ళ్లీ వ‌స్తుంది!

అదే డబ్బు రాజమౌళి చేతిలో పెడితే మరో బాహుబలి తీసి పెట్టేస్తాడు.

Advertisement

తాజా వార్తలు