రజనీను కలిసిన కాంతారా స్టార్.. ఆనందంతో పోస్ట్!

రిషబ్ శెట్టి, సప్తమి గౌడ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా కాంతారా.ఈ కన్నడ సినిమా గురించి ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చించు కుంటున్నారు.

చిన్న సినిమాగా వచ్చిన కన్నడ సినిమా ఇండియన్ సినిమా దగ్గర ఓ రేంజ్ లో సత్తా చాటుతూ అందరి కళ్ళు ఆ సినిమా వైపుకు తిప్పుకుంటుంది.కన్నడంలో రిలీజ్ అయ్యి రికార్డ్ స్థాయి వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ దగ్గర అసాధారణమైన విజయాన్ని నమోదు చేసుకుంది.

ఈ చిన్న సినిమా విజయాన్ని చూసి అందరు ఈ సినిమా గురించే చర్చించు కుంటున్నారు. కాంతారా కన్నడ లోనే కాకుండా రిలీజ్ అయినా అన్ని చోట్ల రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబడుతుంది.

కన్నడంలో హిట్ అవ్వడంతో మిగతా భాషల్లో కూడా డబ్బింగ్ వర్షన్ ను రిలీజ్ చేసారు మేకర్స్.దీంతో అంతా ఈ సినిమాపై ప్రశంసలు అందిస్తున్నారు.

Advertisement

ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా కన్నడలో కొత్త రికార్డులను నెలకొల్పుతుంది.ఇక కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నుండి కూడా ఈ సినిమా ప్రశంసలు అందుకుంది.

ఈయన సినిమాపై ప్రశంసలు అందించడమే కాదు.స్వయంగా రిషబ్ శెట్టిని కలిసి మరీ అభినందించడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కలిగిస్తుంది.

శాలువా కప్పి రిషబ్ ను ప్రశంసించారు.దీనికి రిషబ్ శెట్టి కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.

రజినీకాంత్ స్వయంగా కలిసి అభినందించడంతో రిషబ్ శెట్టి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు.మీరు ఒక్కసారి మెచ్చుకుంటే 100 సార్లు మెచ్చుకున్నట్టు ధన్యవాదములు.రజనీ సార్.

ఇండియన్2 టికెట్స్ తమిళనాడులోనే చీపా.. టికెట్ రేట్లు పెంచి ఏం సాధిస్తారంటూ?
ఆ విషయంలో భయపడుతున్న ఎన్టీఆర్.. అలా చేస్తే రిస్క్ చేసినట్టే అని ఫీలవుతున్నారా?

మా కాంతారా చూసినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.వీరిద్దరూ కలిసిన ఫోటో షేర్ చేయడంతో ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.

Advertisement

ఇక కాంతారా సినిమా ఇప్పటికే అన్ని రికార్డులను చెరిపేస్తూ పోతుంది.మరి ఈ ప్రవాహం ఎప్పుడు వరకు సాగుతుందో చూడాలి.

తాజా వార్తలు